Vishakhapatnam: మద్యం మత్తులో కారు బీభత్సం.. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి
Vishakhapatnam: మరో యువకుడికి తీవ్రగాయాలు
Vishakhapatnam: మద్యం మత్తులో కారు బీభత్సం.. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి
Vishakhapatnam: విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. కారు రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు విజయవాడకు చెందిన జైకృష్ణగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.