ప్రకాశం జిల్లా పూసలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం

*పాదచారుడిని తప్పించబోయి లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

Update: 2022-06-30 02:44 GMT

ప్రకాశం జిల్లా పూసలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం

Road Accident: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుండి అనంతపురం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పాదచారుడిని తప్పించబోయి లారీని ఢీకొని బోల్తా పడింది. వాకింగ్ చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News