కడప జిల్లా ముద్దనూరులో రోడ్డుప్రమాదం

* ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు * ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురికి గాయాలు

Update: 2021-01-12 12:08 GMT

Representational Image

కడప జిల్లా ముద్దనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ముద్దనూరు నుండి చిన్న దుద్యాల గ్రామానికి వెళ్తున్న ఆటోను పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News