Kurnool: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికలు మృతి

Kurnool: కోడుమూరు సమీపంలో బోల్తాపడ్డ వోల్వో బస్సు

Update: 2024-05-23 03:15 GMT

Kurnool: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికలు మృతి 

Kurnool: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వాల్వో బస్సు బోల్తాపడింది. కోడుమూరు సమీపంలోని పాలకుర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి, గోవర్ధనిగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

మిగతా ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా పడగానే.. సాయం కోసం ప్రయాణికులు హాహాకారాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థులతో కలిసి.. సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన వారందరినీ బయటికి తీశారు. జేసీబీ సాయంతో బస్సును నిలబెట్టి... గాయపడిన వారిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అంతా నిద్రమత్తులో ఉండటం.. ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితిలో ప్రయాణికులు ఉండిపోయారు. అప్పుడప్పుడే తెల్లవారుతుండటం.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన చాలా సేపు వరకూ అంబులెన్స్ రాకపోవడంతో.. గాయపడిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. 

Tags:    

Similar News