Accident: కడప జిల్లా ఆదిరెడ్డిపల్లెలో ఘోర ప్రమాదం

Accident: మహిళా కూలీలపైకి దూసుకువచ్చిన జేసీబీ

Update: 2021-10-21 14:57 GMT

representational Image

Accident: కడపజిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లెలో ఘోర ప్రమాదం జరిగింది. జేసీబీ అదుపు తప్పి మహిళా కూలీలను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కేసలింగాయపల్లెకు చెందిన మహిళా కూలీలు పొలం పనులకు వెళ్లి, ఆదిరెడ్డిపల్లెలో ఆటో కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ జేసీబీతో కూలీలపైకి దూసుకువచ్చాడు. దీంతో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. 

Tags:    

Similar News