తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2020-01-15 11:19 GMT
Road accident east godavari district

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రావులపాలెం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి తీవ్రగాయలైయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడవైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును అదుపు తప్పి ఢీకొట్టింనట్ల తెలుస్తోంది. ఈ ప్రమాదంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో మరణించివారు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దీంతో పండగ పూట సిద్ధాంతం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాద ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


   

Tags:    

Similar News