తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ఓ లారీ టోల్ ప్లాజా మీదకు దూసుకెళ్లడంతో అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడు చనిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర, నాలుగు గంటలుగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.