Viveka Murder Case: నిందితులకు జులై 14 వరకు రిమాండ్ పొడిగింపు

Viveka Murder Case: కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ

Update: 2023-06-30 14:10 GMT

Viveka Murder Case: నిందితులకు జులై 14 వరకు రిమాండ్ పొడిగింపు 

Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి సీబీఐ సప్లిమెంటరీ చార్జ్ సీటు దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు జులై 14 వరకు రిమాండ్ పొడిగించింది. వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి , ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ , ఉమా శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను చంచల్ గూడ జైలునుంచి సీబీఐ కోర్టుకు తరలించారు. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. 

Tags:    

Similar News