Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు ఊరట

Janasena: జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించొద్దన్న పిటిషన్ కొట్టివేత

Update: 2024-04-16 09:24 GMT

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు ఊరట

Janasena: గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫౌండర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. మొదట తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇరుపక్షాల వాదనలు తర్వాత తీర్పును వెలువరించింది హైకోర్టు.

Tags:    

Similar News