ఏపీలో కౌలు రైతులకు రైతు భరోసా నిధుల విడుదల.. బటన్ నొక్కి డబ్బులు క్రెడిట్ చేసిన సీఎం జగన్

CM Jagan: సాంకేతిక కారణాలతో నిన్న నిధుల జమ వాయిదా

Update: 2023-09-01 06:53 GMT

ఏపీలో కౌలు రైతులకు రైతు భరోసా నిధుల విడుదల.. బటన్ నొక్కి డబ్బులు క్రెడిట్ చేసిన సీఎం జగన్

CM Jagan: ఏపీలో కౌలు రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమకానున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను జమ చేయనున్నారు. గురువారమే జరగాల్సిన కార్యక్రమం టెక్నికల్ ఇష్యూస్‌తో నేటికి వాయిదా పడింది. ఏపీలో లక్షా 46 వేల 324 మంది కౌలు రైతులకు 109 కోట్ల 74 లక్షల నిధులను జమచేయనుంది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్‌ఆర్ భరోసా పథకాన్ని వర్తింపచేస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News