శ్రీలంక నుంచి తమిళనాడుకు ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారంతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు వెళ్లే రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశారు. అంతేకాకుండా బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్, హైవేలపై డాగ్, బాంబ్ స్క్వాడ్తో సోదాలు చేపట్టారు.