BJP: కర్నూలు జిల్లాలో రాయలసీమ బీజేపీ నేతల భేటీ

BJP: సీమలో పార్టీ బలోపేతంపై సుధీర్ఘంగా చర్చ * హాజరుకానున్న బీజేపీ నేతలు శివప్రకాశ్, దియోధర్

Update: 2021-09-05 06:37 GMT

రాయలసీమ బీజేపీ నేతల భేటీ కర్నూల్ (ఫోటో ది హన్స్ ఇండియా )

BJP: రాయలసీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంపై కాసేపట్లో కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు శివప్రకాష్‌, దియోధర్‌ హాజరుకానున్నారు. సీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంతో పాటు పలు కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జరుగుతున్న వివాదంపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే కర్నూలు కలెక్టర్ బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News