గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని రైతులు ఎలుకల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాల్లో నీరు లేక ఈ సంవత్సరం ఎలుకల బెడద విపరీతంగా ఉందని.. అధికారులు ముందు రైతాంగంపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఎలుకలను పట్టుకునేందుకు ఒక ఎకరాలకు 3 వేల రూపాయల ఖర్చు అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కాల్వలలో నీరు వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.