విశాఖకు రైల్వేజోన్ కేటాయిస్తూ రైల్వే మంత్రి ప్రకటన

Update: 2019-02-27 13:15 GMT

ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయెల్ శుభవార్త అందించారు. ఎప్పటినుంచో పెండింగులో విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తూ అధికారికంగా ప్రకటించారు గోయెల్. దీంతో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమైనట్టయింది. ఈ రైల్వే జోన్ కు సౌత్ కోస్ట్ రైల్వే గా నామకరణం చేశారు. ఎల్లుండి(శుక్రవారం) ప్రధాని మోడీ పర్యటనకు ముందుగా ఈ ప్రకటన వచ్చింది. దీనికోసం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. గతంలో రైల్వే జోన్ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఆ తరువాత ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు గుడివాడ అమర్నాధ్, బొత్స సత్యనారాయణ, టీడీపీలో చేరబోతున్న కొణతాల రామకృష్ణ విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటాలు కొనసాగించారు. రైల్వే జోన్ ప్రకటనతో విభజన హామీల్లో కీలకమైన హామీ నెరవేర్చినట్టయింది కేంద్ర ప్రభుత్వం.

Similar News