విజయవాడలో పిల్లల తల్లులు బ్యాంకులకు క్యూ కట్టారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా వచ్చిన డబ్బులను తీసుకునేందుకు బ్యాంక్ వద్దకు మహిళలు భారీగా చేరుకున్నారు. సింగ్నగర్ ఆంధ్రాబ్యాంక్ వద్ద నగదు డ్రా చేసుకోవడానికి బారులు తీరారు. సంక్రాంతి పండగ దృష్ట్యా మూడు రోజులు సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏటీఎంలు పని చేయడం లేదని ఒకవేళ పని చేసిన డబ్బులు ఉండటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్టంలో పలుచోట్ల ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. బ్యాంకుల ఎదుట కిలోమీటర్ల పొడవున క్యూలో నిల్చున్నారు మహిళలు.