విజయవాడలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం చేసింది. ప్రవీణ్ ట్రావెల్స్కు చెందిన బస్సు బందర్ రోడ్డులో హల్చల్ చేసింది. వేగంగా దూసుకువచ్చిన బస్సు డివైడర్ ఎక్కి అవతలి వైపు వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందు భాగంగా నుజ్జు నజ్జు అయింది. ప్రమాద సమయంలో బస్సులో నలుగురే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.