Ram Nath Kovind: ఇవాళ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

Ram Nath Kovind: నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం జగన్‌.

Update: 2022-02-20 03:16 GMT

Ram Nath Kovind: ఇవాళ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

Ram Nath Kovind: ఇవాళ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రానున్నారు. నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో రాష్ట్రపతికి సీఎం జగన్‌ స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూలో కోవింద్‌ పాల్గొనన్నారు. రాష్ట్రపతితో పాటు.. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు.. ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. కడపలోని పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను జగన్‌ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కుమార్తె వివాహ వేడుకలో సీఎం పాల్గొంటారు. ఇక.. సాయంత్రం విశాఖ చేరుకోనున్న సీఎం జగన్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. రాత్రి ఏడు గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags:    

Similar News