ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4 వేల 377 దుకాణాల లైసెన్సులు మరో 3 నెలల పాటు పొడగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. జూన్ నెలాఖరుకు ముగుస్తుండగా సెప్టెంబర్ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మద్యం పాలసీ ఆలస్యం కావడంతో పాత గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దామాషా పద్దతిలో లైసెన్స్ ఫీజు వసూలు చేయనున్నారు.