లాక్ డౌన్ వల్ల ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అల్తీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఏఎన్ఎం సవరమ్మ, ఆశా కార్యకర్తలు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో రోడ్లపై గుంతలు తవ్వేసిన ఒరిస్సా అధికారులు. ఆసుపత్రికి తరలించే మార్గంలో గుంతలు ఉండటంతో నిలిచిపోయిన అంబులెన్స్. దీంతో ఆమెను డోలి సహాయంతో మోసుకెళ్లి మిలగాం దాటించారు. అనంతరం అక్కడి నుంచి 108 అంబులెన్స్లో కొత్తూరు సామాజిక ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయం అందిస్తున్నారు.