Nakkapalle: పోస్టల్ భీమా చెక్కు అందజేత
మండలంలోని చుక్కలవాని లక్ష్మీపురం గ్రామంలో కాండ్రేగుల వెంకట రామలక్ష్మికి పోస్టల్ డిపార్ట్ మెంట్ సూపరింటెండెంట్ కే.వి.వి. సత్యన్నారాయణ చెక్కును అందజేశారు.
నక్కపల్లి: మండలంలోని చుక్కలవాని లక్ష్మీపురం గ్రామంలో కాండ్రేగుల వెంకట రామలక్ష్మికి పోస్టల్ డిపార్ట్ మెంట్ సూపరింటెండెంట్ కే.వి.వి. సత్యన్నారాయణ, వైసీపీ నాయకుడు కర్రి రాజబాబు చేతుల మీదుగా రూ.85 వేల చెక్కును అందజేశారు.
రామలక్ష్శీ భర్త బోర్ మెకానిక్ కాండ్రేగుల గోవిందు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. కాగా మృతుడి భార్యకు పోస్టల్ భీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి పోస్ట్ మాస్టర్ యర్రంశెట్టి భద్రం, హరి, జ్యోతి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.