మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించే అవకాశం ఉండటంతో పోలీసులు జనసేన కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటన విరమించుకోవాలని అనంతపురం డీఐజీ క్రాంతిరానా కోరారు. అయితే పవన్ మాత్రం రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చిచెప్పారు. పవన్ రాజధాని పర్యటనకు వెళ్తే అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు.