టీడీపీ నాయకుల వాహనం ఓ పిల్లాడికి తగలడంతో..

Update: 2020-03-11 12:27 GMT

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కారును అడ్డగించిన ఓ వైసీపీ కార్యకర్త దాడి చేశాడు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

పల్నాడులో ప్రశాంత పరిస్థితులు చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడ నుంచి పది కార్లలో టీడీపీ నాయకులను చంద్రబాబు పంపించారని ఆరోపించారు. మాచర్లలో టీడీపీ నాయకుల వాహనం ఓ పిల్లాడికి తగలటంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. ఘటనను తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. టీడీపీ నేతలు స్థానికులను దుర్భాషలాడారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమన్నారు.

   

Tags:    

Similar News