ఇసుక రవాణా వాహనాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై రమ్య
ఇసుక రవాణా చేసే వాహనాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తామని పెళ్లకూరు ఎస్సై రమ్య తెలిపారు.
తడ: ఇసుక రవాణా చేసే వాహనాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తామని పెళ్లకూరు ఎస్సై రమ్య తెలిపారు.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తడ పరిధిలోని శ్రీసిటీ రోడ్డు ఎదురుగా, తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టి, వాహనదారుల వద్ద రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్టు పెళ్లకూరు ఎస్సై రమ్య తెలిపారు. ఇక్కడ నిత్యం పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు.