అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలం దిగువపల్లిలో తాగునీటి సమస్యను తీర్చాలంటూ కదిరి హిందూపురం రహదారిపై పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మండలంలోని తిప్పేపల్లి పంచాయతీలో పల్లెపిలుపు కార్యక్రమానికి వస్తుండగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదురుగా దిగువపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే స్పందించి గ్రామస్తులకు వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు విరమించారు.