నెల్లూరు జిల్లాలో పర్యటించిన పవన్ .. నష్టపోయిన రైతుకు రూ. 35వేలు ఇవ్వాలని డిమాండ్‌

రాష్ట్రంలో తుఫాన్ వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు 35 వేల నష్టపరిహారం చెల్లించాలని జనసేన చీఫ్ పవన్‌ డిమాండ్‌ చేశారు. తక్షణ సాయం కింద 10వేలు విడుదల చేయాలన్నారు.

Update: 2020-12-05 13:44 GMT

రాష్ట్రంలో తుఫాన్ వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు 35 వేల నష్టపరిహారం చెల్లించాలని జనసేన చీఫ్ పవన్‌ డిమాండ్‌ చేశారు. తక్షణ సాయం కింద 10వేలు విడుదల చేయాలన్నారు. రైతు కన్నీరు పెడితే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండదన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రెండు రోజుల్లో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుంటే.... ఈ నెల 7న జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన పవన్‌... తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News