Paripoornananda Swamy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద స్వామి

Paripoornananda Swamy: రాయలసీమ జల సీమగా మారింది : పరిపూర్ణానంద స్వామి

Update: 2021-11-25 06:06 GMT

తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన పరిపూర్ణానంద స్వామి (ఫైల్ ఇమేజ్)

Paripoornananda Swamy: తిరుమల శ్రీవారిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామిజీ శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాయలసీమ ప్రస్తుత పరిస్థితుల్లో జల సీమగా మారిందని, చాల మంది ఆకలితో అలమటిస్తూన్నారని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా సేవ భారతి అనే కార్యక్రమం చేపట్టారని, నీరు ఎంత ప్రమాదకరంగా ఉన్న సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. 

Tags:    

Similar News