Gudivada: టీడీపీ నేతలపై పామర్రు పీఎస్‌లో కేసు

Gudivada: శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు వెళ్తున్నారని ఎఫ్‌ఐఆర్

Update: 2022-01-23 03:21 GMT

టీడీపీ నేతలపై పామర్రు పీఎస్‌లో కేసు

Gudivada: టీడీపీ నేతలు వర్ల రామయ్య, దండమూడి చౌదరిపై కృష్ణా జిల్లా పామర్రు పీఎస్‌లో కేసు నమోదయింది. టీడీపీ నిజనిర్దారణ కమిటీ గుడివాడ వెళ్తుండగా పామర్రు దగ్గర పోలీసులు నిలిపివేశారు. అడ్డుకున్న పోలీసులపై అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు FIRలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా గుడివాడకు వెళ్తుండగా నిలిపివేశామని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కలిసి వెళ్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News