నేనొక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తా ..

Update: 2019-05-26 10:11 GMT

ఈ నెల 30న తాను ఒక్కడినే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వై ఎస్ జగన్ చెప్పారు. ఇప్పటి వరకూ జగన్ తో పాటు మరో ఎనిమిది మంది ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇపుడు జగన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజుల తరువాత మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని, అవినీతి రహిత పాలన అందిస్తామని, అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కుంభకోణం జరిగితే విచారణ చేపడతామని చెప్పారు.  

Similar News