ఒంగోలు బాలికపై రేప్కు పాల్పడ్డ నిందితుడు వైసీపీ నాయకుడని చెప్పడానికి ఆందోళనగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్తో రేప్కు పాల్పడ్డ నిందితుడు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్న నారా లోకేశ్ దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు అని విమర్శించారు. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైందని సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. @ysjagan గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది. pic.twitter.com/MhXo6gQQ3Q
— Lokesh Nara (@naralokesh) June 25, 2019