రేపు ఒంగోలు కలెక్టరేట్‌లో ఇరువర్గాల మత్య్సకారులతో సమావేశం

* పరిష్కారం దిశగా ప్రకాశం జిల్లా చీరాల మత్స్యకారుల వివాదం * హాజరుకానున్న మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి * ఇప్పటికే ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపిన ఆక్వా ఛైర్మన్

Update: 2021-01-03 05:21 GMT

ప్రకాశం జిల్లా చీరాల మత్స్యకారుల మధ్య విభేదాలు తొలగించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అరెస్టయిన మత్స్యకారులు బెయిల్‌పై విడుదల కావడంతో  రేపు ఒంగోలు కలెక్టరేట్‌లో ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మత్స్యకార కమిషన్‌తో పాటు ఇతర అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఇరువర్గాల మత్స్యకారులతో ఆక్వా చైర్మన్‌ సంప్రదింపులు జరిపారు. రెండువర్గాలకు చెందిన ఐలవల, బల్లవలపై నిషేధం విధించారు.

Full View


Tags:    

Similar News