మరో వారంరోజులు ఒక్కపూట బడులే

Update: 2019-06-16 12:39 GMT

జూన్ నెల సగం రోజులు గడిచినప్పటికీ ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంటి నుంచి బయటి రావాలంటేనే జనం జంకుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వడగాడ్పులు అధికమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒంటిపూట బడులు మరో వారం రోజుల పాటు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఒక్కపూట బడులను ఈ నెల 22 వరకు కొనాసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నెల 24 నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News