పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు

Puttaparthi: మూడు రోజులపాటు ప్రశాంతి నిలయంలో ఓనం సందడి

Update: 2022-09-08 01:14 GMT

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సాయి కుల్వంత్ సభామండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఓంకారంతో ఓనం వేడుకలను ప్రారంభించారు. మూడు రోజలు పాటు సాగే ఓనం వేడుకల కోసం వందలాది మంది కేరళా భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. కేరళ రాష్ట్ర హైకోర్టు జడ్జి దేవన్ రామచంద్రన్ పుట్టపర్తికి చేరుకున్నారు. సాయంత్రం సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకుని ప్రశాంతి నిలయంలో జరిగే ఓనం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు .  

Tags:    

Similar News