కడపలో ఉత్సాహాంగా సాగిన ఒలంపిక్ డే

Update: 2019-06-23 08:03 GMT

ఆర్ధిక పరమైన ఇబ్బందుల కారణంగా క్రీడాకారులు క్రీడలకు దూరం కావడం బాధకరమన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా.ఒలంపిక్ డే లో భాగంగా కడప కోటిరెడ్డి కూడలిలో ఏర్పాటు చేసిన రన్‌ను డిప్యూటి సిఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్వఛ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్ధులు ఉత్సాహాంగా పాల్గొన్నారు. క్రీడాకారులను పోత్సహించే విధంగా సిఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.. ప్రతి పాఠశాలలో విద్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి క్రీడాకారులుగా తీర్చిదిద్దే విధంగా వ్యాయామ ఉపాద్యాయులు కృషి చెయ్యాలని సూచించారు.. 


Tags:    

Similar News