అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థిలు

* ముక్తేశ్వరంలోని ఓ నర్సింగ్‌ కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్న పల్లవి

Update: 2023-03-18 12:09 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థిలు

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముక్తేశ్వరంలోని ఓ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న పల్లవి అనే విద్యార్ధినిని రెండవ అంతస్ధు పై నుంచి తోటి విద్యార్దులు తోసేశారు. దీంతో పల్లవికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే పల్లవిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాలేజి ‎హాస్టల్‌ రూంలో ఎనిమిదిమంది విద్యార్ధినిలతో కలిసి ఉంటుంది పల్లవి.రాత్రి డబ్బులు పోయాయని తోటి విద్యార్దినిలు అందరి బ్యాగ్స్ వెతికారు.తన మీద అనుమానంతోనే ఉదయం బ్రెష్ చేసుకుంటున్న సమయంలో వెనక నుంచి గెంటేశారని పల్లవి అన్నారు.

Tags:    

Similar News