ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగ్ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు గాను రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధుల్లో రూ.708 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు విడుదల చేసిన నిధులు గతంలో పెండింగ్లో ఉన్నవేనని స్పష్టంచేసింది. రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలు, యుటిలైజేషన్ సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.