ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ..

Update: 2019-08-07 09:38 GMT

ఏపీలో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల16న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ప్రకటించింది ఈసీ. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల నాని, కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందడటంతో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

Tags:    

Similar News