విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎస్ రాయవరం మండలం సోముదేవపల్లి గ్రామంలో వరహానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదికి ఆనుకుని ఉన్న నూకాలమ్మ తల్లి ఆలయం ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కళ్ళ ముందు ఆలయం నది ప్రవహంలోకి వెళ్లడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు.