కులానికి సంబంధించి తానెలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయలేదని.. నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. తానన్నట్లు ఆధారాలు చూపిస్తే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమని.. తేల్చిచెప్పారు. నిరూపించకపోతే వైసీపీ నాయకులంతా రాజీనామాలు చేస్తారా అని సవాల్ విసిరారు. దళితులంటే అపారమైన గౌరవం ఉందని నన్నపనేని అన్నారు .