సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టమన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. బాబా మహా సమాధిని దర్శించుకున్న ఆయన సమాజానికి సేవ చేయాలనే ప్రేరణ బాబా ఇచ్చారని ప్రేరణతోనే తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు బాబా ఆశీర్వాదాలు తీసుకోవాలని పుట్టపర్తికి వచ్చానని తెలిపారు. బాబా మనకు భారత జీవన విధానంలో విలువలతో కూడుకున్న విద్యను అందించారని గడ్కరీ కొనియాడారు.