గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్

ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్‌ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ వివరించినట్లు తెలుస్తోంది.

Update: 2020-11-18 06:56 GMT

ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్‌ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ వివరించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు చేపడతానని ఈసీ ప్రకటించడం, కరోనా విస్తరణ సమయంలో ఎన్నికలు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో ఈసీ భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ ప్రకటించారు.

Tags:    

Similar News