Andhra Pradesh: ద్రౌపది ముర్మును సత్కరించిన సీఎం జగన్

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముర్ము సమావేశం

Update: 2022-07-12 12:43 GMT

Andhra Pradesh: ద్రౌపది ముర్మును సత్కరించిన సీఎం జగన్

Andhra Pradesh: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌ స్వాగతం పలికారు. ఎంపీలు ఆమెకు గిరిజన సంప్రదాయ ప్రకారం ఘనస్వాగతం పలికారు. ద్రౌప‌ది ముర్ము వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ప్రకటించిన వెంటనే వైసీపీ తన మద్దతును ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

Tags:    

Similar News