Vijayawada: దుర్గగుడిలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

*భవానీలతో నిండుతున్న క్యూ లైన్లు *ఇంద్రకీలాద్రిపై భవానీ మాల విరమణ లేదంటున్న అధికారులు

Update: 2021-10-17 04:08 GMT

దుర్గగుడిలో  కొనసాగుతోన్న భక్తుల రద్దీ(ఫైల్ ఫోటో)

Vijayawada: విజయవాడ దుర్గగుడిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. మాల విరమణ కోసం ఆరు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తుండటంతో కొండపై రద్దీ పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ 300 రూపాయల టికెట్ రద్దు చేశారు అధికారులు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనాల లైన్లుగా కొనసాగిస్తున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై భవానీ మాల విరమణలు లేవని తెలిపారు.

Tags:    

Similar News