మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. వైఎస్ వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్యకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయనున్నారు. నాలుగో నిందితుడిగా వాచ్మెన్ రంగయ్యను సిట్ అధికారులు చేర్చారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో రెండు రోజలుగా సిట్ విచారణ కొనసాగుతోంది. త్వరలో నార్కో అనాలసిస్ టెస్ట్ ఉండొచ్చని సమాచారం.