ఏపి అసెంబ్లీ లో నారా లోకేష్ .. వైసీపీ ఎమ్మెల్యేలతో ఆత్మీయ కరచాలనం

Update: 2019-06-14 09:48 GMT

మూడో రోజు ఏపి అసెంబ్లీ కళకళలాడింది . ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు ... అయితే ఏపి మాజీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు అసెంబ్లీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అసెంబ్లీలోని ఎమెల్యేలను ఆప్యాయంగా పలకరించారు . ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తూ చాలా హుషారుగా కనిపించారు.

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండటంతో అసెంబ్లీకి వచ్చారు. లోకేష్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి అళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

Tags:    

Similar News