Nara Lokesh: నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం..
Nara Lokesh: ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా..? అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్.
Nara Lokesh: నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం..
Nara Lokesh: ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా..? అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ విజయవాడలో నిరసన తెలపాలనుకున్న కాలేజీ విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల్లోకి పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు లోకేష్. వారికి పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక ప్రభుత్వ ఆదేశాలే కారణం అని ఆయన ఆరోపించారు. నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుంది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఐతే చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపై నిరసనకు సిద్ధమయ్యారు విద్యార్థులు. దీంతో కళాశాలల నుంచి విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించడం చర్చనీయాంశంగా మారింది.