జగన్‌కు ఆ అలవాటు పోలేదు: నారా లోకేష్

Update: 2020-05-21 06:35 GMT

విద్యుత్ చార్జీలు పెంచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు కోసం ప్రజలను పీడించే అలవాటు జగన్‌కి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలేదని నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు లాక్‌డౌన్‌ కష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా గుట్టుగా కరెంటు ఛార్జీలు పెంచి డబ్బు గుంజుతున్నారని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. పాలన అంటే ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలి కానీ, కష్టాల్లోకి నెట్టడానికి కాదని జగన్‌ గ్రహించాలని హితవు పలికారు.

పార్టీ రంగులేయడానికి మీరు చేసిన వృథా ఖర్చుకన్నా 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేస్తే వచ్చే నష్టం ఏమీలేదు. కాబట్టి ఆ పని చేసి ప్రజలను ఆదుకోండి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలి అని లోకేష్ కోరారు.



 



Tags:    

Similar News