జగన్ అలాంటి రకం.. ప్రజలకు చేసిందేమీ లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.

Update: 2020-04-04 11:55 GMT
Nara Lokesh(file photo)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. 'జగన్ మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు' 'మా ఇంటికొస్తే ఏం తెస్తారు' అనే రకమని ఆయన దుయ్యబట్టారు.లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదని లోకేష్ అన్నారు.

కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులపై లేకపోవడం బాధాకరమని లోకేశ్ విమర్శించారు. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా... డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుంచి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.

కాంట్రాక్టర్లపై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? అని లోకేశ్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదని నారా లోకేశ్ అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో 5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారని.. సీఎం జగన్ మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని ట్విట్టర్ వేదికగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Tags:    

Similar News