ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై బాపట్ల వైఎస్సార్ సీపీ ఎంపీ నందిగం సురేశ్ ఫైర్ అయ్యారు.. మాదిగల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న ఆయన.. వారు బాగుపడే ఉద్దేశం మందకృష్ణకు లేదని ధ్వజమెత్తారు. హడావుడిగా ఏపీకి వచ్చి అల్టిమేటం ఇస్తున్నారని విమర్శించారు. మందకృష్ణ వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో అందరికీ తెలుసన్న ఆయన.. 15 రోజల క్రితం పొగిడి ఇప్పుడు తిట్టడం వెనక ఆంతర్యం ఏంటని పేర్కొన్నారు.