Nageswara Rao: పెట్రో ధరలపై చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేయాలి

* పెట్రో ధరలు పెంచింది కేంద్రం-తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్ రావు

Update: 2021-11-09 05:40 GMT

తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్ రావు(ఫైల్ ఫోటో)

Nageswara Rao: పెట్రోల్ డీజిల్ రేట్లు అంశంపై ఏపీలో కాదు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టాలని తణుకు ఎమ్మేల్యే కారుమూరి నాగేశ్వర్ రావు టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఇష్టానుసారుంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది కేంద్ర ప్రభుత్వమన్నారు. సీఎం జగన్ రాష్ర్టంలో పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

చేయాలి దమ్ముంటే బీజేపీ పై ధర్నా చేయాలి కుప్పం మున్సిపాలిటీని కూడా గెలిచే దమ్ము చంద్రబాబుకి లేదు. ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి కేంద్రం 3 లక్షల 45 వేల కోట్లు ప్రజా ధనాన్ని తీసుకున్నారు.

పార్టీలకతీతంగా పథకాలు ఇస్తున్నాం కాబట్టి అందరూ మాతో కలిసి వస్తున్నారు. కుప్పంలో గెలవలేక దొంగ ఏడుపులు చంద్రబాబు ఏడుస్తున్నాడు. కుప్పం లో ఇల్లు లేదు కార్యకర్తలు ఇంట్లో ఉండలేక బస్సుల్లో రాజకీయలు చేస్తున్నందుకు సిగ్గు పడు చంద్రబాబు

Tags:    

Similar News