జనసైనికుల్ని వేధిస్తే సహించం: నాగబాబు

Update: 2019-07-26 16:05 GMT

జనసేన కార్యకర్తలపై వైసీపీ నాయకులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. పోలీసులు అధికారంలో ఉన్న వారికి సపోర్టు చేయవచ్చు కానీ తప్పుడు కేసులు పెట్టకూడదని తెలిపారు. ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తలలో ఆత్మస్తైర్యం నింపేందుకు తాను వచ్చినట్లు తెలిపారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను సహించనని వారికి అండగా ఉండి పోరాడతానని తెలిపారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చారని బాగా పరిపాలించాలని చెప్పారు.  

Tags:    

Similar News